కరోనా తెచ్చిన కష్టాలు...దివాళా తీసిన కోటీశ్వరులు

by సూర్య | Wed, Jun 22, 2022, 02:22 PM

కరోనా అందర్నీ రోడ్డుపాలు చేసింది. కోటీశ్వరులను కూడా ముంచేసింది. ఇలాంటి కథే తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ డ్రీమ్-2... ఇది ఒక అత్యంత విలాసవంతమైన ఓడ పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ లైనర్లలో ఒకటి అవ్వాల్సిన ఓడ ఇది. ప్రస్తుతం ఇది జర్మనీలోని ఓ షిప్ యార్డ్ లో ఉంది. గ్లోబల్ డ్రీమ్-2 దురదృష్టం ఏమిటంటేదీని సొంతదారులు దివాలా తీశారు. ఇక, ఇంత పెద్ద ఓడను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దాంతో దీన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీసి తుక్కు సామాను కింద అమ్మేయనున్నారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ క్రూయిజ్ నౌక ఒక్కసారి కూడా సముద్రయానం చేయలేదు. తొలి ప్రయాణమే తుక్కు సామాన్ల యార్డుకు చేస్తోంది.  


గ్లోబల్ డ్రీమ్-2కు ఓ సోదర నౌక కూడా ఉంది. దాని పేరు గ్లోబల్ డ్రీమ్. దాన్ని మాత్రం సముద్రయానాలకు సమాయత్తం చేసి, అప్పులు తీర్చుకోవాలన్న యోచనలో యాజమాన్యం ఉంది. ఆసియాకు చెందిన డ్రీమ్ క్రూయిజస్ ఈ నౌకల యజమాని. అయితే, కరోనా దెబ్బకు డ్రీమ్ క్రూయిజెస్, దాని మాతృ సంస్థ జెంటింగ్ హాంకాంగ్ ఆర్థికంగా కుప్పకూలాయి. దాంతో, రుణ సంస్థలు ఈ నౌకలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM