మిర్చి రైతులకు గుడ్ న్యూస్..పెరిగిన ధరలు
by సూర్య |
Wed, Jun 22, 2022, 12:50 PM
మిర్చి ధరలు పెరిగాయి. గుంటూరు మిర్చి యార్డులో వారం రోజుల వ్యవధిలోనే క్వింటా రూ.4 వేలు పెరిగింది. నవంబర్ వరకూ కొత్త సరుకు రాకపోవడంతో మిర్చికి డిమాండ్ పెరిగింది. చైనాలో మిర్చి పంట దెబ్బతినడంతో మన మిర్చి ధరలు పెరిగాయని మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా నాణ్యత గల మిర్చి క్వింటా రూ.20 వేలుకు పైగా పలుకుతోంది.
Latest News