శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా కలిసి పనిచేద్దాం

by సూర్య | Wed, Jun 22, 2022, 12:26 PM

పోలీస్ శాఖ  సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కృష్ణ జిల్లాకి నూతనంగా పి.జాషువా ఎస్పీగా  నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి.జాషువా ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం మంగళవారం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఐఏఎస్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా కలిసి కృషి చేయాలని, అందుకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం కోసం పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని కలెక్టర్  కి తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM