కొనసాగుతున్న భక్తుల రద్దీ
by సూర్య |
Wed, Jun 22, 2022, 10:38 AM
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణగిరి షెడ్లులో కూడా భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలల్లో చాలా మంది వేచిఉన్నారు. రూ.300ల ప్రత్యేక దర్శనానికి మాత్రం 4 గంటలపైనే సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
Latest News