27న అమ్మఒడి నగదు జమ
by సూర్య |
Wed, Jun 22, 2022, 08:22 AM
విద్యార్థుల తల్లులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27వ తేదిన అమ్మఒడి పథకం డబ్బులను తల్లుల ఖాతాలో జమచేయనున్నట్లు వెల్లడించింది. అమ్మఒడి పథకంలో భాగంగా మూడో విడత నగదు జమను 27వ తేదీన సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ సారి తల్లుల ఖాతాలో రూ.13వేలను మాత్రమే వేయనున్నారు.
Latest News