మావోయిస్టుల దాడి...ముగ్గురు జవాన్ల మరణం

by సూర్య | Wed, Jun 22, 2022, 01:24 AM

ఒడిశాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టులు అదను చూసి భద్రతాబలగాలను దెబ్బకొట్టారు. నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మరణించినవారిని ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, సిబ్లాల్, ధర్మేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించారు. 


ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒడిశాలో స్తబ్దుగా ఉన్న నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసమే ఈ దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో మావోలు భారీ ఆయుధ సంపత్తిని వినియోగించినట్టు కాల్పులు జరిగిన స్థలంలో లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM