ఏపీని తిరోగ‌మ‌నంలో తీసుకెళ్తున్నార‌ు: అచ్చెన్నాయుడు

by సూర్య | Sun, May 22, 2022, 02:49 PM

ఏపీని తిరోగ‌మ‌నంలో తీసుకెళ్తున్నార‌ు అని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. అమెరికాలోని బోస్టన్ లో నిర్వ‌హించిన‌ మహానాడును ఉద్దేశించి వర్చువల్ గా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఏపీని ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ దేశాలు చిన్న చూపు చూసేలా చేశార‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాల్సి ఉంద‌ని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని, ఏపీని తిరోగ‌మ‌నంలో తీసుకెళ్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ క‌బంద హ‌స్తాల నుంచి కాపాడాల‌ని ఆయ‌న అన్నారు. 


గ‌తంలో చంద్ర‌బాబు ఎన్నో పెట్టుబ‌డులు తీసుకొచ్చార‌ని, వాటి అన్నింటినీ వైసీపీ ప‌క్క‌దారి ప‌ట్టించేసింద‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. అప్పుల‌ను రూ.8.50 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచేశార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల ద్వారా డ‌బ్బులు ఇస్తున్నామంటూ సీఎం జ‌గ‌న్ స‌భ‌ల్లో బ‌ట‌న్ నొక్కుతున్నార‌ని, అయితే, ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు మాత్రం రావ‌డం లేద‌ని బుచ్చ‌య్య చౌద‌రి ఆరోపించారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM