జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తుంది

by సూర్య | Sun, May 22, 2022, 11:17 AM

ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తట్టుకోలేకపోతున్నార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రతిష్ట ఏమైపోయినా పర్వాలేదన్నది బాబు ఉద్ధేశం. సీఎం వైయ‌స్‌ జగన్‌కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మంచి ఫలితాలతో దావోస్‌ నుంచి తిరిగివస్తామ‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Latest News

 
బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు Sat, Apr 20, 2024, 02:03 PM
మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి Sat, Apr 20, 2024, 02:02 PM
అనకాపల్లి లో అడుగుపెట్టిన సీఎం జగన్ Sat, Apr 20, 2024, 02:01 PM
వర్ల రామయ్య కి నోటీసులు Sat, Apr 20, 2024, 02:00 PM
గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? Sat, Apr 20, 2024, 01:57 PM