ముక్కంటి దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

by సూర్య | Sun, May 22, 2022, 09:16 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎన్. తుకారంజి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద దృశ్యాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM