by సూర్య | Sun, May 22, 2022, 09:10 AM
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం మండలంలోని తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్రగాయాలు, డ్రైవర్ కు గాయాలయ్యాయి. బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Latest News