నన్ను మహిళా పోలీసులు కొడుతున్నారు: సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య అనిత వాయిస్ మెసేజ్

by సూర్య | Sat, May 21, 2022, 09:21 PM

ఏపీలో అనుమానాస్పదంగా మరణించిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఏపీ పోలీసుల‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య అనిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహం పోస్టుమార్టానికి అనుమ‌తి ఇస్తూ సంత‌కం పెట్టాల‌ని త‌న‌పై పోలీసులు ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆమె ఆరోపించారు.  ఈ క్ర‌మంలోనే మ‌హిళా పోలీసుల‌తో త‌న‌ను కొట్టిస్తున్నార‌ని ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ మేర‌కు ఓ వాయిస్ మెసేజ్‌ను ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌కు పంపింది. సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ అనిత‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.


ఇదిలావుంటే ఏపీవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంపై కాకినాడ‌లో శ‌నివారం ఉద‌యం నెల‌కొన్న ఉద్రిక్తత సాయంత్రం దాకా కొన‌సాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ కారులో శవంగా క‌నిపించిన సుబ్ర‌హ్మ‌ణ్యంను ఎమ్మెల్సీనే హ‌త్య చేశార‌ని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్ట్ చేసేదాకా మృత‌దేహానికి పోస్టుమార్టం చేయ‌నీయ‌బోమంటూ బాధిత కుటుంబం అడ్డుకుంటోంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM