సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం

by సూర్య | Sat, May 21, 2022, 04:03 PM

రాజమండ్రి నగరంలోని 34 వార్డులో శనివారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ద్వారా లబ్దిపొందిన వివరాలను తెలుపుతూ ప్రభుత్వ ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు.


ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదరికమే అర్హతగా భావించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత వై. యస్ జగన్మోహన రెడ్డికి దక్కుతుందన్నారు.

Latest News

 
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM
బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌ Thu, Apr 25, 2024, 03:50 PM