by సూర్య | Sat, May 21, 2022, 02:59 PM
అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గంగాధరనెల్లూరు ఎస్ఐ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలం పరిధిలోని ఠానా చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వయసు కలిగిన ప్రమీల అనే మహిళ కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నారు.
ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 29 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం టాప్ స్టార్ బ్రాండ్ను, 90 ఎం. ఎల్ టాటా పాకెట్లను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
Latest News