రామయ్యకు స్వర్ణ తులసి పూజలు

by సూర్య | Sat, May 21, 2022, 02:44 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం స్వర్ణ తులసి పూజలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి మూలమూర్తులకు సుప్రభాతసేవ, ఆరాధన, సేవాకాలం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం, తిరుమంజనం జరిపించారు. నిత్య కళ్యాణమూర్తులను మేళతాళాలతో ఆలయం నుంచి బేడ మండపానికి తీసుకొచ్చి ఘనంగా రామయ్య నిత్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:20 PM
వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం Fri, Mar 29, 2024, 01:18 PM
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM