ఘాట్ రోడ్డు లోయలో పడిన లారీ

by సూర్య | Sat, May 21, 2022, 02:27 PM

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి జీడికర్రల లారీ బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నడింపాలెం గ్రామానికి చెందిన సుంకరి పండుకు చెందిన 30 టన్నుల జీడిమామిడి కర్రల లోడుతో బయలుదేరిన లారీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో చింతాలమ్మ ఘాట్‌ మూడవ మలుపు వద్ద 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ దూకేందుకు ప్రయత్నించగా డోర్‌ ఓపెన్‌ కాలేదు. అయితే లారీ వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న యజమాని పండు డ్రైవర్‌ కేకలు విని ఆగాడు. తర్వాత అతికష్టం మీద లోయలోకి దిగి లారీ డోర్‌ తెరవడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. లారీలో డ్రైవర్‌ మినహా మరెవ్వరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM