by సూర్య | Sat, May 21, 2022, 02:09 PM
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మర్రిబంద ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి సమీపంలో 16 వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ స్పాట్లో దుర్మరణం పొందగా మరో ముగ్గురు స్వల్పంగా హాయపడ్డారు. దీనికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్సై సన్నిబాబు మీడియాకు అందజేసిన వివరాల ప్రకారం కశింకోట నుంచి రేగుపాలెం గ్రామానికి సరుగుడు కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టరును మర్రిబంద గ్రామానికి సమీపంలో వెనుకనుంచి వేగంగా వెళ్తున్న కియా కారు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ రెడ్డి అప్పారావు(39) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద స్థలం వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించినట్టు ఎస్సై సన్నిబాబు తెలిపారు.
Latest News