అదనపు విస్టాడోమ్ కోచ్ కోసం అరకు ఎంపీ లేఖ

by సూర్య | Sat, May 21, 2022, 02:08 PM

ఆంధ్రా ఊటీ అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం మరో విస్టాడోమ్ కోచ్న కేటాయించాలని కోరుతూ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వాల్తేర్ డివిజన్సీ నియర్ డీసీఎంకు లేఖ రాశారు. విశాఖ-అరకు మధ్య నడుస్తున్న రైలుకు ప్రస్తుతం రెండు విస్టా డోమ్ కోచ్లను జతచేస్తున్నారు. ఇవి ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో ప్రయాణించడంతో, ఈమార్గంలో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరో విస్టాడోమ్ కోచ్ను కేటాయించాలని ఆమె లేఖ ద్వారా కోరారు. అదేవిధంగా దేశవిదేశాల పర్యాటకులు సందర్శించే అరుకు రైల్వేస్టేషన్కు అధిక ప్రాధాన్యమిచ్చి, అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. ఈ ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపినట్టు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM