by సూర్య | Sat, May 21, 2022, 01:53 PM
వెలిగండ్ల లో ఎస్సై విశ్వనాధ రెడ్డి ఆధ్వర్యంలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. రోడ్డుప్రమాదాల పై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను ఎస్సై హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని తెలియజేశారు.
Latest News