by సూర్య | Sat, May 21, 2022, 01:45 PM
శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మెదడు పుస్తకం పట్టణం అంతే అవసరమని భువనేశ్వరి అన్నారు. శ్రీకాళహస్తి స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. వచ్చే నెల 30వ తేదీ వరకు నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరంలో పాల్గొని విజ్ఞానం పెంచుకోవాలని కోరారు. అనంతరం గ్రంథాలయ అధికారి సుజాత పిల్లలకు కథలు చెప్పడం, చిత్రలేఖనం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
Latest News