వేరుశనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి

by సూర్య | Sat, May 21, 2022, 01:16 PM

వేరుశనగ విత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రాల్లో శనివారం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి మహబూబాష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 కిలోల వేరుశనగ బస్తా పూర్తి ధర 2574 రూపాయలు వుండగా సబ్సిడీ 1029. 60 రూపాయలు పోగా రైతు 1544. 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


ఎకరాలోపు రైతులకు 2 బస్తాలు, ఎకరాపైన వున్న రైతులకు 3 బస్తాలు అందచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ల కొరకు సంబంధిత రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యూరియా, డిఎపి ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా వున్నాయన్నారు. కావాల్సిన రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏమైనా సమస్య వుంటే వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో గాని, మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని ఆయన తెలియచేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM