ఇంటికి నిప్పంటించిన మొదటి భార్య.. నలుగురు మృతి

by సూర్య | Sun, May 15, 2022, 12:08 AM

తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ కోపంతో రగిలిపోయింది. చాన్నాళ్లు భర్తతోనూ, సవతితోనూ గొడవలు పడింది. చివరికి కోపంలో దారుణానికి పాల్పడింది. ఆమె కోపానికి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బీహార్‌లో సుపౌల్​బాజార్‌ ప్రాంతానికి చెందిన ఖుర్షీద్ ఆలం, బీబీ పర్వీన్‌‌కు పదేళ్ల క్రితం పెళ్లైంది. వారిద్దరికీ పిల్లలు పుట్టలేదు. దీంతో సంతానం కోసం రోష్మి ఖతూన్‌ అనే మహిళను ఖుర్షీద్ మూడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త నిర్ణయాన్ని తట్టుకోలేకపోయిన పర్వీన్ తొలి నుంచీ గొడవ పడుతూ వచ్చింది. తాను ఎంతకైనా తెగిస్తానని కొన్నాళ్లుగా బెదిరిస్తూ వచ్చింది.

చివరికి శనివారం ఉదయం గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆగ్రహంతో ఇంటిపై పెట్రోల్ పోసి పర్వీన్ నిప్పు అంటించింది. ఈ ప్రమాదంలో పర్వీన్ ఇంట్లోనే ఉండిపోవడంతో సజీవ దహనమైంది. ఆమె అత్త రుఫైదా ఖతూన్ కూడా ఇంటి వద్దే మరణించింది. భర్త ఖుర్షీద్, అతడి రెండో భార్య రోష్మి ఖతూన్‌ గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్ప పొందుతూ మరణించారు. ఇలా రెండో పెళ్లి వారి జీవితంలో చిచ్చు పెట్టగా, మొదటి భార్య కోపం నలుగురి ప్రాణాలను బలిగొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM