ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

by సూర్య | Sat, May 14, 2022, 09:35 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2022 నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఈ విషయాన్ని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు వెల్లడించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 10వ తేదీ వరకు స్వీకరిస్తామని ప్రకటించారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షను జూలై 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Latest News

 
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM