by సూర్య | Sat, May 14, 2022, 05:02 PM
చిత్తూరు: తంబళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలో పెద్దమండ్యం రహదారిలో ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం గోపి దిన్నే నుండి తంబళ్లపల్లె కు వస్తున్న ఆటో నల్ల గడ్డ బావి రోడ్డకు కుక్క అడ్డం రావడంతో దీన్ని తప్పించడానికి ఆటో డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇందులో మెహబూబ్ సాబ్ తీవ్రంగా గాయపడటంతో, మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తరలించారు.
Latest News