నూనె దిగుమతులపై టాక్స్ తగ్గించండి

by సూర్య | Sat, May 14, 2022, 03:31 PM

వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైయ‌స్‌ జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు.. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు వేర్వేరుగా  సీఎం వైయ‌స్ జగన్‌  లేఖలు రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందన్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. ఈనేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.సుమారు 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని లేఖలో సీఎం వైయ‌స్ జగన్‌ గుర్తు చేశారు. అయితే తాజా పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని.. ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని సీఎం వైయ‌స్ జగన్‌ లేఖలో ప్రస్తావించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM