ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు అసాధ్యం: బీజేపీ ఎంపీ

by సూర్య | Sat, May 14, 2022, 03:29 PM

ఏపీలో 3 రాజధానులను వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించి, విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. దీనిపై అమరావతి రైతులు కోర్టుకెక్కారు. రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ 3 రాజధానులకు సంబంధించి, మరో కొత్త బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఏపీ మంత్రులు మీడియా ముఖంగా ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు కీలక ప్రకటన చేశారు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు అసాధ్యమని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిందని, దానిపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయలేదని గుర్తు చేశారు. దీంతో 3 రాజధానుల అంశం ముగిసిందనే విషయం వైసీపీకి కూడా తెలుసన్నారు.


ఇక శనివారం ఆయన అమరావతి ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటించారు. తాము అమరావతి రాజధాని అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. దీనిపై రెండేళ్ల క్రితమే తాము స్పష్టం చేశామని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు నిధులు కేటాయిస్తే, మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. మూడు రాజధానుల అంశాన్ని వదిలి, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM