బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం

by సూర్య | Sat, May 14, 2022, 03:12 PM

తుపాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వ్యవసాయం దండగన్న టీడీపీ నేతలు, స్టీరింగ్ కమిటీ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగ సంక్షేమానికి నాడు వైయ‌స్సార్‌, నేడు వైయ‌స్ జగన్ ఎంతో కృషి చేశారన్నారు.

Latest News

 
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు Fri, Apr 19, 2024, 11:54 AM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM