చంద్రబాబు పై విరుచుకుపడ్డ సాయి రెడ్డి

by సూర్య | Sat, May 14, 2022, 03:09 PM

ప్ర‌పంచానికే పాఠాలు నేర్పాన‌నే చంద్ర‌బాబుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుణ‌పాఠం నేర్పి కుప్పానికే ప‌రిమితం చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ఓ పోస్టును ట్వీట్ చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మూడేళ్ల పాల‌న‌లో కుప్పాన్ని  మున్సిపాలిటీ చేశార‌ని, 40 ఏళ్ల అనుభ‌వం అనే బాబు చేత కుప్పంలో ఇల్లు క‌ట్టుకునేలా చేశార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. తలదించుకుంటే సరిపోతుందా? 3సార్లు CM అయినా కుప్పంను మున్సిపాలిటీ చేయలేక పోయావు. రెవిన్యూ డివిజన్ కోసం వైయ‌స్ జగన్ గారిని ప్రాధేయపడి, నీవల్ల కాలేదని అంగీకరించావు. పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నావు. కుప్పం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రజలు నిలదీయారా బాబూ? అంటూ అంత‌కు ముందు ట్వీట్ చేశారు.

Latest News

 
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM