by సూర్య | Sat, May 14, 2022, 02:24 PM
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయపరంగా మంచి ఫలితాలు సాధించాలని తాసిల్దారు చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో మండల రైతుల సలహా మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ద్వారా అందుతున్న ఇరవై ఒక్క సేవలపై తహసిల్దార్ అవగాహన కల్పించారు.
Latest News