విజయవాడలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి

by సూర్య | Sat, May 14, 2022, 02:21 PM

 విజయవాడలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఆచార్య ఆనందరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినా స్పందించలేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈక్రమంలో ఆచార్య ఆనందరావును వీసీగా రీకాల్ చేయాలనీ డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నిరసనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శనివారం విజయవాడ ధర్నాచౌక్ నుండి రాజ్ భవన్ కు తరలి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాచౌక్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM