by సూర్య | Sat, May 14, 2022, 02:06 PM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం లోని నాగంపల్లి లో బంగారమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పలు అభిషేకాలు, విశేషాలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద అంబలి పోశారు. మహిళలు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. వివిధ గ్రామాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Latest News