by సూర్య | Sat, May 14, 2022, 01:55 PM
అసని తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం లో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి మిరప పంట రైతులు భారీగా నష్టపోయారు. మండలంలో రైతులు చేతికి అందివచ్చిన 110 ఎకరాల్లో మిరప పంట వర్షానికి దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమయయ్యారు. తడిసిన మిరపకాయలను ఆరబెట్టుకుంటున్నారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
Latest News