ఏపీ సీఎస్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

by సూర్య | Sat, May 14, 2022, 12:20 PM

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర సర్కార్ కు సీఎం జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. 


జగన్‌ ప్రతి పాదనకు సానుకూలంగా కేంద్ర సర్కార్‌ స్పందించింది. ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 30వ తేదీ వరకు పదవీ కాలాన్ని పొడిగించేందుకు డీవోపీటీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News

 
నేడు మంత్రి సురేష్ పర్యటన వివరాలు Fri, Apr 19, 2024, 01:40 PM
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి Fri, Apr 19, 2024, 01:33 PM
ఈ నెల 23 నుండి డిగ్రీ పరీక్షలు Fri, Apr 19, 2024, 01:22 PM
వ్యక్తి అనుమానస్పద మృతి Fri, Apr 19, 2024, 01:19 PM
క్వింటా చింత పండు గరిష్టంగా రూ.15000 Fri, Apr 19, 2024, 01:18 PM