ప్రజా క్షేమము కోసం పోరాడే నాయకునికి జన్మ దిన శుభాకాంక్షలు

by సూర్య | Sat, May 14, 2022, 12:13 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, రాజకీయాలలో సంచనలమైన మాటలు మాట్లాడుతుంది ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వైసీపీ ఎంపీ రఘురామా రాజు. వైసీపీ లో ఉండి , వైసీపీ పాలనా సరిగ్గా లేదు అంటూ, సీఎం జగన్ ని సైతం లెక్క చెయ్యకుండా మాట్లాడిన వారే ఈయన. దానికి ప్రతిఫలంగా జైలుకి వెళ్లడం పోలీస్ వారు ఆయనని కొట్టడం ఇవన్నీ మనకు తెలిసినవే. పదవులు కాదు, ప్రజా క్షేమమే  నాకు ముఖ్యం అని ఆయన మీడియా సందర్భంగా ఎన్నోసార్లు తెలియచేసారు.   ఐతే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులూ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ క్రమంలోనే,  టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ... పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యం అంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని తనదైన శైలిలో ఎండగడుతున్న వైసీపీ ఎంపీ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవాలు  బయటపెడుతున్నారనే కక్షతో సొంత పార్టీ ఎంపి అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి జగన్ రెడ్డి వికృతానందం పొందింది కూడా గతేడాది ఇదే రోజు అని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM