by సూర్య | Sat, May 14, 2022, 11:45 AM
ఏపీ సీఎం జగన్ ఈ నెల 20 నుంచి 31 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం 10 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 20న కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. మే 22, 23, 24 తేదీల్లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో భేటీ కానున్నారు. సదస్సులో ఏపీ పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ హాజరు కానున్నట్లు సీఎంవో వెల్లడించింది. అనంతరం మే 25 నుంచి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు. దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్ కు హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.
Latest News