రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

by సూర్య | Sat, May 14, 2022, 10:01 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చెందాడని గజపతినగరం ఎస్. ఐ సి. హెచ్. గంగరాజు శనివారం తెలిపారు. గజపతినగరం మండలం లోని మరుపల్లి ఓలం కంపెనీ సమీపంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ఎం. భగవాన్ (21) ద్విచక్రవాహనంపై విశాఖ వెళ్తుండగా ఓలం పరిశ్రమ సమీపంలో జరుగుతున్న పనుల వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. భగవాన్ కు తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆటోలో గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భగవాన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM