నేటి నుంచి నిత్యకల్యాణ దేవతామూర్తుల బ్రహ్మోత్సవాలు

by సూర్య | Sat, May 14, 2022, 09:50 AM

కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. బెంగళూరు నుంచి తెచ్చిన అనేక రకాల పుష్పాలతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయ అలంకరణ చేశారు. విశాఖపట్నం నుంచి విచ్చేసిన వేదపండితులు సంతోష్ శర్మ బ్రహ్మోత్సవాలకు అవసరమైన పూజా ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నారు. శనివారం ఉదయం గణపతిపూజ, స్వస్తి వాచనం, మూలవిరాట్ దేవతా మూర్తుల కలశస్థాపన, రుత్విక్ కరణం, గోపూజ, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట మహోత్సవం, పూజా సేవలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్యసాయినాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు గత నాలుగు రోజులుగా ఉత్సవాల నిర్వహణలో నిగ్నమై భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM