నీటి గుంతలో పడి బాలుడు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:49 AM

నిర్మాణంలో ఉన్న ఓ నీటి గుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన కడప నగరంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవుని కడపకు చెందిన బాలకృష్ణ, యల్లమ్మ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి అయి దుగురు పిల్లలుండగా నాలుగో సంతానం బాబుజ్జ (6), ఈ క్రమంలో వీరి నివాస సమీపంలో ఆర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కొన్ని రోజుల కిందట తీసిన గుంతలు రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలతో నిండిపోయాయి.


బాబుజ్జ తోటి చిన్నారులతో కలిసి ఆడుకునేందుకు శుక్రవారం బయటికి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. వెంటనే తోటి పిల్లలు పెద్దలకు సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి బాలుడిని గుంతలో నుంచి బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. కొన్ని నెలల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ గునాదులకే పరిమితమైంది. నిర్మాణం పూర్తి అయి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM