by సూర్య | Sat, May 14, 2022, 09:32 AM
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎంఈఓ శ్రీదేవి పేర్కొన్నారు. పుట్లూరు మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో శుక్రవారం ఆ అంశంపై ఉపాధ్యాయులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ. వేసవి సెలవుల్లో పుస్తక పఠన ప్రాధాన్యతను విద్యార్థులు గ్రహించేలా చేయాలని, బాలబాలికలు ఇంటి పట్టున ఉంటూ వివిధ రకాల పుస్తకాలను చదువుతూ నైపుణ్యాలు పెంపొందిం చుకునేలా తోడ్పాటు అందించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లోని వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీవో యోగానంద రెడ్డి, ఆర్పీ అమీర్బషా, ప్రధానోపాధ్యా యులు పాల్గొన్నారు.
Latest News