by సూర్య | Sat, May 14, 2022, 09:28 AM
డోన్ పట్టణానికి చెందిన ఎస్ అన్వర్ బాషా 31 గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టి మృతిచెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. నంద్యాల జిల్లా డోన్ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన అన్వర్ బాషా 31 వృత్తిరీత్యా గత పదేళ్లుగా లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.
గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి డోన్ కు వస్తుండగా మానోపాడు జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ఇనుప కడ్డీల లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య మౌలాబి, కుమారుడు జూనేద్, కూతురు సోను ఉన్నట్లు తెలిపారు.
Latest News