by సూర్య | Sat, May 14, 2022, 09:27 AM
విద్యా రంగ సమస్యలపై పోరాడే నాయకులు, విద్యార్థులను అరెస్టు, సస్పెండ్ చేయడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. వామపక్ష, ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే రాజ్ భవన్ ముట్టడిలో భాగంగా శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులుని అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేశారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వీసీని రీకాల్ చేసే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు కొన్నసాగిస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమ నిర్వహిస్తామన్నారు.
Latest News