by సూర్య | Sat, May 14, 2022, 09:21 AM
గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 157 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కేశవ రెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 17 వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 18వ తేదీన దరఖాస్తు పరిశీలన, 19, 20 తేదీల్లో మౌలిక పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మండల కార్యాలయంలో ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Latest News