by సూర్య | Sat, May 14, 2022, 02:22 AM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు లేఖలు రాశారు. ఆవనూనెపై సుంకాన్ని తగ్గించాలని ఈ లేఖల్లో ఆయన కేంద్ర మంత్రులను కోరారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్కు తీవ్ర కొరత ఏర్పడిన విషయాన్ని ఆయన తన లేఖల్లో ప్రస్తావించారు. ఈ కారణంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు కాస్తంతైనా ఉపశమనం కలగాలంటే ఆవ నూనెపై కేంద్రం విధిస్తున్న సుంకాలను ఏడాది పాటు తగ్గించాలని కేంద్ర మంత్రులను జగన్ కోరారు.
Latest News