తన కార్యాలయంలో తనకు భద్రతలేదని నా భర్త చెప్పారు: కశ్మీర్ పండిట్ భార్య ఆరోపణ

by సూర్య | Sat, May 14, 2022, 02:09 AM

జమ్ముకశ్మీర్ లో పండిట్ రాహుల్  భట్ హత్య దేశంలో కలకలంరేపుతోంది. తాజాగా ఆయన భార్య చేసిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వానికి ఇరకాటంలో నెడుతోంది. జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను ఆయన కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ లో ఆయనను కాల్చి చంపి పరారయ్యారు. ఈ దారుణ ఘటనపై ఆయన భార్య స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను చంపేందుకు ఆయన కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. తాను పని చేస్తున్న కార్యాలయంలో తనకు భద్రత లేదని, జిల్లాలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని తన భర్త పలుమార్లు విజ్ఞప్తి చేశారని చెప్పారు. కానీ అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కంటతడి పెట్టారు.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM