by సూర్య | Fri, May 13, 2022, 04:57 PM
వైసీపీ పాలనలో గతంలో రాజ్యసభలో యాదవులకు ఒక సీటు కేటాయించారని ఇది హర్షణీయమని, జూన్ లో రాజ్యసభలో నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయని ఇందులో మరో సీటును యాదవులకు కల్పించాలని, అఖిల భారత యాదవ సంఘం నాయకులు భూసగాని లక్ష్మయ్య, వాసు, శివ ప్రసాద్ యాదవులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ అన్ని అంశాలలో యాదవులు పూర్తిగా నష్టపోయారని రాజ్యసభ సీట్ల భర్తీలో తమకు న్యాయం చేయాలని కోరారు.
Latest News