by సూర్య | Wed, Jan 19, 2022, 10:01 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల స్నేహ ప్రభుత్వం కాదని, ఉద్యోగుల పట్ల శత్రువుల వ్యహరిస్తుంది అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ పేరుతో ఉద్యోగులను నట్టేట ముంచుతోందన్నారు. మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమేనన్నారు
హెచ్ ఆర్ ఏ తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత అన్యాయం చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎన్నడూ చూడలేదని ఆరోపించారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వం కాదని, ఉద్యోగుల పట్ల శత్రువుల వ్యహరిస్తుంది. బకాయిలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. వేతనాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు.