by సూర్య | Wed, Jan 19, 2022, 09:34 PM
విశాఖ పై కరోనా పంజా విసింది, దానితో జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1827 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఇప్పటివరకు 1,69,013 కేసులు నమోదయ్యాయి. 1,58,729 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,137 మంది చికిత్స పొందుతున్నారు. 1148 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరమైతే బయటకు రావాలన్నారు. ముఖానికి మాస్క్ ధరించాలి. శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.
Latest News