by సూర్య | Wed, Jan 19, 2022, 04:48 PM
ఏపీ లో కరోనా తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్లైన్ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల లో కారుణ్య నియామ కాలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన ఉద్యోగి నిర్వహిస్తున్న పోస్టుకు సమానమైన లేదా అంతకంటే తక్కువ ఉద్యోగం ఉన్న వ్యక్తిని సామాజిక భద్రత కల్పనగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా నవంబర్ 31, 2021 నాటికి నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది, అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున ఆలస్యమైందని ప్రభుత్వం తెలిపింది. ఈ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీలను కారుణ్య నియామకం కింద మరణించిన ఫ్రంట్లైన్ కార్మికుల కుటుంబ సభ్యులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి వారితో గ్రామ వార్డు సచివాలయాలలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Latest News