by సూర్య | Wed, Jan 19, 2022, 11:08 AM
ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. అయితే ఏపీలో పండుగ తర్వాత కూడా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పాఠశాలల్లో ఒకే రోజు 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు సిబ్బందికి కోవిడ్ సోకింది.
Latest News