by సూర్య | Wed, Jan 19, 2022, 08:15 AM
గుంటూరు జిల్లా: చిలకలూరిపేట మండలం బొప్పూడి-తాతపూడి మధ్య మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మురికి పూడికి చెందిన అచ్చి అంకమ్మరాజు(20) తన మోపెడ్పై చిలకలూరిపేట వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట వైపు వెళ్తుండగా మార్టూరు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి పెట్రోల్ బంకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంకమ్మరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News