by సూర్య | Tue, Jan 18, 2022, 09:19 PM
ఆంధ్రప్రదేశ్లో క్యాసినోలు, క్యాబరే డ్యాన్సులతో రాష్ట్రం పరువు తీస్తారా.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు అయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగు సంస్కృతిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలపై జరుగుతున్న దాడిని తెలుగు ప్రజలంతా ఎదుర్కోవాలన్నారు. గుడివాడలో క్యాసినోలు, క్యాబరే డ్యాన్సుల విషయం ముఖ్యమంత్రికి, డీజీపీకి తెలియదా?అని నిలదీశారు. సంక్రాంతి సందర్భంగా రూ.250 కోట్లు చేతులు మారాయని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేని డీజీపీ అవసరమా? పోలీసు వ్యవస్థను పాతాళానికి దిగజార్చిన ఘనత డీజీపీ సవాంగ్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి, డీజీపీ ఆమోదంతో తెలుగు సంస్కృతిపై దాడిగా పరిగణిస్తామని వర్ల రామయ్య సంచలనం వ్యాఖ్యలు అన్నారు.
Latest News